big boss: 'బిగ్ బాస్'లో మెరవనున్న ఇద్దరు టాలీవుడ్ భామలు!

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో, ఇద్దరు టాలీవుడ్ భామలు బిగ్ బాస్ హౌస్ లోకి అడుపెట్టారు. 'జై లవ కుశ' సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన నివేదా థామస్, రాశీఖన్నాలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ఈ రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్ లో వీరు ప్రేక్షకులను అలరించనున్నారు. ఇదే సమయంలో ఈ రోజు శనివారం కావడంతో, జూనియర్ కూడా షోలో కనిపించనున్నాడు. మరోవైపు, ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవ కుశ' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ సినిమా ప్రచారంలో భాగంగా నివేదా, రాశీ ఖన్నాలు బిగ్ బాస్ లో సందడి చేయనున్నారు.

More Telugu News