delhi: డ్యూటీలో ఉన్న జవానును పదే పదే కొట్టిన ఢిల్లీ మహిళ అరెస్ట్... వీడియో చూడండి!

  • జవాన్లతో అకారణంగా గొడవపడిన స్మృతీ కాల్రా
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • ఆపై వెంటనే బెయిల్
  • సోషల్ మీడియాలో విమర్శలు

తమ విధులకు వెళ్లే జవాన్లను తరలించే వాహనం ముందు కారును నిలిపి, జవాన్లతో అకారణంగా గొడవపడి, ఇద్దరిని పదే పదే కొట్టిన ఢిల్లీ మహిళ స్మృతీ కల్రా (44)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జవాన్లపై ఆమె దాడి చేస్తున్న వీడియో నిన్న వెలుగులోకి వచ్చి కలకలం రేపగా, ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని అన్నారు.

కాగా, సౌత్ ఢిల్లీలోని వసంత్ కుంజ్ సమీపంలో స్మృతీ తన కారును ఆర్మీ వాహనం ముందు నిలిపింది. ఆపై ఏం జరిగిందో ఏమో, ఆమె కారు దిగి వచ్చి జవాను చంపలు వాయించింది. ఈ లోగా మరో అధికారి వచ్చి ఆమె ఆగ్రహానికి కారణం తెలుసుకునే పని చేశాడు. ఈ ఘటనంతా మరో కారులో ఉన్న వ్యక్తి వీడియో తీశాడు. స్మృతీపై విధుల్లో ఉన్న ఉద్యోగులను కొట్టడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన తదితర సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇక ఈ వీడియో చూసిన వారంతా దేశ భద్రత నిమిత్తం ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించే జవాన్లపై చెయ్యి చేసుకోవడం ఏంటని సోషల్ మీడియా ఆమెపై ఫైర్ అయింది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News