suicide: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం.. ఆత్మహత్య చేసుకుంటున్న తల్లిని కాపాడేందుకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి

  • షాక్‌లో గ్రామస్తులు
  • చిన్నారులు ముగ్గురు ఏడేళ్ల లోపు వారే
  • చావుబతుకుల మధ్య తల్లి

మధ్యప్రదేశ్‌లో గుండెలు పిండేసే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటున్న తల్లిని కాపాడేందుకు వెళ్లిన ఏడేళ్ల లోపు చిన్నారులు ముగ్గురు సజీవ దహనమయ్యారు. రాష్ట్రంలోని దమోలో ఈ ఘటన చోటుచేసుకుంది.  రాణి లోధి (30) తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా గమనించిన చిన్నారులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో చిన్నారులు ముగ్గురు మృతి చెందగా 70 శాతం గాయాలైన తల్లి జబల్‌పూర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

చిన్నారులను తుల్సా (2), ముస్కాన్ (5), మాన్సి (7)లుగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కడుపు నొప్పికి తాళలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు రాణి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు ఎస్పీ అర్వింద్ దూబే తెలిపారు. అయితే ఇంకేవైనా కారణాలున్నాయోమోనన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News