gurmeet: హనీప్రీత్ ఏర్పాటు చేసే ప్రత్యేక 'రూబరూ' పార్టీల్లో యువతులపై వల విసిరే గుర్మీత్!

  • కేవలం ఉన్నత వర్గాల మహిళలకే ప్రవేశం
  • ఒక్కొక్కరి నుంచి రూ. 15 వేల వరకు వసూలు
  • అక్కడుండే ఏకైక వ్యక్తి గుర్మీత్ ఒక్కడే
  • డబుల్ మీనింగ్ డైలాగులతో వల విసిరే బాబా
  • తమవంతు సహకారాన్ని అందించే సాధ్వీలు

డేరా సచ్చా సౌధా ముసుగులో గుర్మీత్ రామ్ రహీమ్ చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక ఫేస్ బుక్ స్క్రీన్ షాట్ ఆధారంగా విచారిస్తే, గుర్మీత్ బాబా మరో అకృత్యం బయటకు వచ్చింది. గుర్మీత్ అత్యంత సన్నిహితురాలైన హనీప్రీత్ సింగ్, 'రూబరూ' పేరిట రాత్రి పూట పార్టీలను ఏర్పాటు చేసేదట. కేవలం ఉన్నత వర్గాలకు చెందిన మహిళలను మాత్రమే ఈ పార్టీకి ఆహ్వానించేవారు. ఇందులోకి ప్రవేశమున్న ఏకైక పురుషుడు గుర్మీత్ మాత్రమే.

ఒక్కొక్కరి నుంచి రూ. 15 వేల వరకూ వసూలు చేసే హనీ ప్రీత్, సాధ్వీలను ఏజంట్లుగా చేసుకుని పాల్గొనాల్సిన మహిళలను ఎంపిక చేసేది. ఈ పార్టీలకు ఆకర్షణీయమైన దుస్తులు, విచిత్రమైన వేషధారణతో వచ్చే గుర్మీత్, డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతూ, పాటలు పాడుతూ మహిళలను ఆకర్షించి, వారితో నృత్యాలు చేయిస్తాడు. వారిలో తనకు నచ్చిన వారిని వలలో వేసుకుంటాడు. అందుకు హనీప్రీత్ తో పాటు సాధ్వీలు తమవంతు సహకారాన్ని అందించేవారని అధికారులు వెల్లడించారు. ఈ తరహా పార్టీలు ఎన్నో జరిగాయని పేర్కొన్నారు.

More Telugu News