: 2019-20 నాటికి 50 కోట్ల స్వదేశీ మొబైల్ ఫోన్స్ తయారీ!

2019-20 నాటికి 50 కోట్ల మొబైళ్ల తయారీ సామర్థ్యాన్ని సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని  ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. స్వదేశీ (మేడిన్ ఇండియా) మొబైళ్ల తయారీలో మున్ముందు గణనీయ వృద్ధిని చూస్తామని అన్నారు. 2014 లో 6 కోట్ల మొబైళ్లను తయారు చేసుకున్నామని, 2016-17లో 17.5 కోట్ల మొబైళ్లను తయారు చేశామని చెప్పారు. ఆ సంఖ్య 2019-20 నాటికి 50 కోట్ల మొబైళ్లు తయారు చేసే స్థితికి చేరతామని చెప్పారు. 

More Telugu News