: ఆస్ట్రేలియా సిరీస్ కూడా సాధిస్తాం: చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్

ఈ నెల 17 నుంచి ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరగనున్న వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంటుందని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఈ రోజు ఆయన తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన బాగా రాణిస్తోందని, మంచి వాతావరణం ఏర్పడిందని అన్నారు. టీమిండియా ప్రతిభ, కోహ్లీ వ్యక్తిగత పర్ఫార్మెన్స్ అలానే ధోనీ ఎక్స్ పీరియన్స్ కారణంగా భారతజట్టు చాలా చక్కగా రాణిస్తోందని, ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ లో కూడా మన వాళ్లు బాగా ఆడతారని, సిరీస్ ను చక్కగా కైవసం చేసుకుంటారనే పూర్తి విశ్వాసం తనకు ఉందని చెప్పారు.

కాగా, శ్రీలంకతో ఇటీవల జరిగిన టెస్టు, వన్డే సిరీస్ తో పాటు ఏకైక టీ20 మ్యాచ్ ను టీమిండియా కైవసం చేసుకుని మంచి ఉత్సాహంగా ఉంది. ఇదే ఉత్సాహంతో, ఆసీస్ తో జరగనున్న వన్డే సిరీస్ ను టీమిండియా తన ఖాతాలో వేసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

More Telugu News