nara rohith: విలన్ మనసు దోచుకునే 'కథలో రాజకుమారి'!

మొదటి నుంచి కొత్తదనమున్న పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ నారా రోహిత్ వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'కథలో రాజకుమారి' ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మహేశ్ సూరపనేని మాట్లాడుతూ, ఈ సినిమాలో చాలా వరకూ నారా రోహిత్ విలన్ గానే కనిపిస్తాడని చెప్పారు.

అలాంటి విలన్ జీవితంలోకి 'కథలో రాజకుమారి'లా ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ అమ్మాయి ఆయనను మంచివాడిలా ఎలా మార్చిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని అన్నారు. రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగిన ఈ పాత్రకి నారా రోహిత్ జీవం పోశాడని చెప్పారు. ఆయన సరసన కథానాయికగా నమితా ప్రమోద్ నటించిందని అన్నారు. నాగశౌర్య సినిమా ఆర్టిస్టుగానే గెస్టు పాత్రలో కనిపిస్తాడనీ, మరో ముఖ్యమైన పాత్రలో నందితా రాజ్ నటించిందని చెప్పారు.    

More Telugu News