ntr: 'జై లవ కుశ'లో ముందుగా అనుకున్న ముగింపును మార్చారా?

ఎన్టీఆర్ అభిమానులంతా 'జై లవ కుశ' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో జై .. లవ .. కుశ .. ఈ మూడు పాత్రలు కూడా దేనికదే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఈ మూడు పాత్రలు తెరపై విలక్షణంగా కనిపిస్తూ ఆసక్తిని రేపేవే. జై పాత్రలో రాక్షసత్వం ఎక్కువ అనే విషయం టీజర్ తోనే అర్థమైపోయింది. ఆ పాత్రను లవ .. కుశ కలిసి అంతమొందించడాన్ని క్లైమాక్స్ గా అనుకున్నారట.

అయితే ఆ తరువాత అలా కాకుండా మరింత ఆసక్తికరంగా ఉండేలా క్లైమాక్స్ ను మార్చారనే ప్రచారం ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది. ఇందులో వాస్తవమెంతో గానీ .. ఇప్పుడు ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ తో జోడీ కట్టిన రాశి ఖన్నా .. నివేదా థామస్ ఇద్దరూ కూడా, ఈ సినిమా తమ కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కి హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనేది ఆయన అభిమానుల మాట.   

More Telugu News