: మీరు పెట్టిన మంట అలా ఉంది మరి.. అందుకే బెదిరింపులు: క‌ంచ ఐల‌య్య‌తో ఆర్య‌వైశ్య సంఘం

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అని టైటిల్ పెట్టి ఓ పుస్తకం రాసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై ఆర్యవైశ్య సంఘాలు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ఆర్య‌వైశ్యుల‌కు ప్రొ. కంచ ఐల‌య్య క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని ఆ సంఘం నేతలు అన్నారు. ఈ రోజు ఓ న్యూస్ ఛానెల్ వేదిక‌గా ఐల‌య్యతో మాట్లాడిన ఆర్య‌వైశ్య సంఘం నేత‌లు ఇటువంటి రాతలు రాస్తే ఏ సామాజిక వ‌ర్గం వారికైనా కోపం వ‌స్తుంద‌ని అన్నారు. ఐలయ్య పెట్టిన మంట అలా ఉంది అని, అందుకే బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. త‌మ‌తో కూర్చొని చ‌ర్చించి ఐల‌య్య మ‌న‌సులో ఉన్న ఆ భావాల‌ను క‌డిగేసుకోవాల‌ని అన్నారు. ఐల‌య్య మీద ఎవ్వ‌రూ దాడి చేయ‌బోర‌ని అన్నారు. 

More Telugu News