: అభివృద్ధికి అడ్డుపడేవారిని అడ్రస్‌ లేకుండా చేయాలి: ప్రజలకు చంద్రబాబు పిలుపు

రాష్ట్రంలో తాము జరుపుతోన్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు కొంద‌రు అడ్డుపడుతున్నారని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. అటువంటి వారిని అడ్రస్‌ లేకుండా చేయాలని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తెట్టంగిలో ఈ రోజు చంద‌్రబాబు నాయుడు... ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... తాను తెలుగు జాతి కోసం రాత్రింబవళ్లు కష్టపడతాన‌ని ఉద్ఘాటించారు. తాము ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చుతున్నామ‌ని అన్నారు. రైతులకు రుణవిముక్తి కల్పించామ‌ని పేర్కొన్నారు. అలాగే, తాము చేప‌ట్టిన సంక్షేమ కార్యక్రమాల అమలులో రాజకీయాలకు చోటులేదని చెప్పారు.

More Telugu News