ntr: దుమ్మురేపేస్తోన్న 'జై లవకుశ' ట్రైలర్

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవ కుశ' సినిమా .. ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇంతకు ముందు ఈ సినిమాలోని ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఒక్కో పాత్రపై ఒక్కో టీజర్ రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ మూడు పాత్రలను కవర్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు.

ఈ మూడు పాత్రల స్వరూప స్వభావాలకు అద్దం పడుతూ ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 2.8 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకున్న ఈ ట్రైలర్, 1.4 లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనిని బట్టి ఈ సినిమా ఒక రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఖాతాలోకి మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరడం ఖాయమనేది ఆయన అభిమానుల మాట.

More Telugu News