Anushka: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  'మా అమ్మ కోరిక తీరింది..' అని చెబుతోంది అందాలతార అనుష్క. "నేను ఎన్ని రకాల పాత్రలు పోషించినా నన్ను యువరాణి లాంటి పాత్రల్లో చూడాలని వుందని మా అమ్మ చెప్పేది. 'రుద్రమదేవి' సినిమాతో అమ్మ కోరిక తీరిపోయింది. ఆ సినిమాలో నన్ను చూసి తను ఎంత ముచ్చట పడిందో' అని చెప్పింది అనుష్క.
*  ఇరవై ఏళ్ల తర్వాత మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ మళ్లీ కలసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. 1997లో వీరిద్దరూ కలసి 'ఇద్దరు' (ఇరువర్) సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు 'ఒడియన్' అనే మలయాళ సినిమాలో వీరిద్దరూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
*  'వీడెవడు' సినిమాలో ఓ విభిన్నమైన పాత్ర పోషించానని చెప్పాడు హీరో సచిన్ జోషి. 'పెళ్లయిన రెండు రోజులకే భార్య పోతుంది. తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలతో జైలుకి వెళతాడు. అలాంటి సంఘర్షణాత్మక పాత్రను పోషించాను' అని చెప్పాడు సచిన్. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 15న రిలీజ్ చేస్తున్నారు.  

More Telugu News