mahesh babu: మహేశ్ తో మూవీ గురించి ఇప్పుడే ఏం చెప్పలేను : అల్లరి నరేశ్

ప్రస్తుతం మహేశ్ బాబు .. కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత మహేశ్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన పనుల్లో వంశీ పైడిపల్లి బిజీగా వున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేశ్ కి ఈ ప్రశ్న ఎదురైంది. ఈ విషయమై ఇప్పుడే తాను ఏం చెప్పలేనని అల్లరి నరేశ్ అన్నాడు. ఆ సినిమా గురించి మాట్లాడటానికి చాలా సమయం ఉందనీ .. ప్రస్తుతం ఆ మూవీ గురించిన విషయంలో తాను కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేనని చెప్పాడు. నెక్స్ట్ తాను చేయనున్న రెండు ప్రాజెక్టులపైనే తన దృష్టి ఉందనీ, ఆ సినిమాలతో కొత్తగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. 

More Telugu News