varun tej: రెండు థియేటర్లలో రెండు కోట్లు కొల్లగొట్టిన 'ఫిదా'

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ - సాయి పల్లవి జంటగా నటించిన 'ఫిదా' .. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతోంది. 85 కేంద్రాలలో ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం. తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని 'సుదర్శన్' థియేటర్లో ఈ సినిమా కోటి రూపాయలను వసూలు చేసింది.

అదే విధంగా వైజాగ్ 'జగదాంబ' థియేటర్లోను కోటి రూపాయల వసూళ్లను సాధించింది. తెలంగాణ నేపథ్యం .. తెలంగాణ యాస ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమా, వైజాగ్ లో ఈ స్థాయి వసూళ్లను సాధించడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ రెండు థియేటర్స్ లో ఈ సినిమా రెండు కోట్లను సాధించిన విషయాన్ని 50 రోజుల పోస్టర్ ద్వారా తెలియజేశారు. మొత్తానికి శేఖర్ కమ్ముల తానేంటనేది మరోమారు చూపించాడు.     

More Telugu News