mahesh babu: 'బాహుబలి' తరువాత ప్లేస్ లో 'స్పైడర్'

మహేశ్ బాబు కథానాయకుడిగా చేసిన 'స్పైడర్' మూవీ .. ఈ నెల 27వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు .. తమిళ .. హిందీ .. మలయాళ .. అరబిక్ భాషల్లో  ఏక కాలంలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. మురుగదాస్ - మహేశ్ బాబు క్రేజ్ కారణంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగినట్టు తెలుస్తోంది.

 ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల వరకూ జరిగిందని అంటున్నారు. 'బాహుబలి' .. 'బాహుబలి 2' తరువాత ఆ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా ఇదేనని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 120 కోట్లకు అమ్ముడవగా, శాటిలైట్ .. ఆడియో హక్కులు కలుపుకుని 30 కోట్లకి అమ్ముడైనట్టు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 69 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. 

More Telugu News