vijay devarakonda: విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ హీరోయిన్ రష్మిక మందన!

గీతా ఆర్ట్స్ బ్యానర్లో పరశురామ్ గతంలో 'శ్రీరస్తు శుభమస్తు' అనే సినిమాను తెరకెక్కించాడు. అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా విజయాన్ని సాధించింది. దాంతో ఇదే బ్యానర్లో మరో సినిమా చేసే ఛాన్స్ ఆయనకి దక్కింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఆయన ఈ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం ఆయన కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఎంచుకున్నాడు.

అయితే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ సినిమా యూనిట్ కథానాయికగా కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి కన్నడ హీరోయిన్ 'రష్మిక మందన'ను తీసుకున్నట్టు తెలుస్తోంది. కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ' హిట్ తో రష్మిక మందన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాతో తెలుగులో తన హవాకు ఆరంభం పలుకుతుందేమో చూడాలి.     

More Telugu News