ajith: చెన్నైలో 'బాహుబలి' వసూళ్లను అధిగమించిన 'వివేగం'

'బాహుబలి' ఎక్కడ విడుదలైతే అక్కడ వసూళ్ల విషయంలో ఆ తరువాత సినిమాలకు ఒక టార్గెట్ పెట్టింది. ఆ టార్గెట్ ను చేరుకోవడమో .. అధిగమించడమో ఆ తరువాత సినిమాల లక్ష్యంగా మారింది. ఈ విషయంలో సక్సెస్ అయితే ఇక ఆ సినిమా టీమ్ సంతోషం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం 'వివేగం' టీమ్ అలాంటి సంతోషాన్నే పొందుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్స్ లో విడుదలైన 'వివేగం' .. తొలి రోజునే 33 కోట్ల 8 లక్షల రూపాయలను రాబట్టింది. చెన్నైలో రెండవ వారంలోనే 8 కోట్లను వసూలు చేసి 'బాహుబలి' రికార్డును అధిగమించింది. అజిత్ క్రేజ్ కు అద్దం పడుతూ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక విడుదలైన సినిమాలు 100 కోట్లను రాబట్టడం కష్ట సాధ్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోను ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.     

More Telugu News