: విజయవాడలో వంగవీటి రాధ ఇంటి వద్ద ఉద్రిక్తత.. సొమ్మసిల్లిపడిపోయిన రాధా తల్లి!

విజయవాడ వైసీపీలో రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. దివంగత వంగవీటి రాధా, ఆయన సోదరుడు రంగాలపై వైసీపీ నేత గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి వంగవీటి రత్నకుమారి, వారి అనుచరులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను ఖండించే నిమిత్తం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు.

దీంతో విజయవాడ, మొగల్రాజపురంలోని తమ నివాసం నుంచి రాధ, రత్నకుమారి బందర్ రోడ్డులోని వైసీపీ కార్యాలయానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, రాధా నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులతో రాధా, రత్నకుమారి వాగ్వాదానికి దిగారు. పోలీసులకు, వీరికి మధ్య తోపులాట జరిగింది. దీంతో, రత్నకుమారి సొమ్మసిల్లి పడిపోయారు. రాధాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

More Telugu News