ntr: ఆసక్తిని రేకెత్తిస్తూ 'జై లవ కుశ' నుంచి న్యూ పోస్టర్స్!

ఎన్టీఆర్ అభిమానులు 'జై లవ కుశ' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 21వ తేదీన వాళ్ల నిరీక్షణ ఫలించబోతోంది. ఆ రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ఆడియోను రేపు రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ గణేశ్ నిమజ్జనం హడావిడిలో వద్దని భావించి, నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.

 ఈ నెల 10వ తేదీన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్యలో అభిమానులను అలరించడానికన్నట్టుగా రెండు కొత్త పోస్టర్లను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ మూడు లుక్స్ తో కనిపించే పోస్టర్ తో పాటు, ఎన్టీఆర్ - రాశి ఖన్నా - నివేదా థామస్ కాంబినేషన్లోని మరో పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు పోస్టర్స్ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.     

More Telugu News