vijay setupathi: మళ్లీ భయపెట్టడానికి 'పిజ్జా 2' వచ్చేస్తోంది!

ఆ మధ్య తెలుగులో వచ్చిన హారర్ సినిమాల్లో 'పిజ్జా' ఒకటి. తమిళ అనువాదంగా వచ్చిన ఈ సినిమా ఇక్కడ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్లో హీరోగా విజయ్ సేతుపతి నిలదొక్కుకోవడానికి హెల్ప్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి. అలాంటి ఈ సినిమాకి 'పురియాత్ పుతీర్' పేరుతో సీక్వెల్ ను తెరకెక్కించారు.

 విజయ్ సేతుపతి - గాయత్రి జంటగా నటించిన ఈ సినిమా, తమిళంలో ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'పిజ్జా 2' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావడానికి నిర్మాత వెంకటేశ్ సన్నాహాలు చేస్తున్నాడు. ఉత్కంఠ భరితమైన కథా కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా, అనువాద కార్యక్రమాలను పూర్తి చేసుకుందని ఆయన చెప్పాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా, తెలుగులో 'పిజ్జా' మాదిరిగానే హిట్ టాక్ తెచ్చుకుంటుందేమో చూడాలి.

More Telugu News