puri: పూరి నెక్స్ట్ మూవీ హీరో ఎవరో కాదు.. ఆయన తనయుడే!

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'పైసా వసూల్' సినిమా రేపు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో పూరి జగన్నాథ్ వున్నాడు. ఈ సినిమా తరువాత పూరి ఏ హీరోతో చేయవచ్చనే ఆసక్తి అభిమానుల్లో వుంది. ఆయన నెక్స్ట్ మూవీ హీరో ఎవరో కాదు .. ఆయన తనయుడు ఆకాశ్ అనేది తాజా సమాచారం.

గతంలో ఆకాశ్ 'ఆంధ్రాపోరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తరువాత నటన, డాన్స్, ఫైట్స్ కి సంబంధించిన శిక్షణను విదేశాల్లో తీసుకున్నాడు. ఆ శిక్షణ పూర్తికావడంతో .. ఆకాశ్ ను రీ లాంచ్ చేయడానికి పూరి రెడీ అవుతున్నాడు. కథ కూడా రెడీగానే ఉందని అంటున్నారు గనుక, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. ఎంతో మంది యంగ్ హీరోలకి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన పూరి, తన తనయుడిని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడో చూడాలి మరి.    

More Telugu News