: చంద్రబాబుకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది: భూమా బ్రహ్మానందరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుకు తమ కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందని నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి లేకపోయినా బాబాయి భూమా నాగిరెడ్డి, పిన్ని శోభా నాగిరెడ్డి చేతుల్లో తాను పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమ గెలుపు సీమ రాజకీయాల్లో మార్పు తెస్తుందని, టీడీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. నంద్యాలలో ఫ్యాక్షనిజం గత చరిత్ర అని, ఇప్పుడు లేదని చెప్పిన బ్రహ్మానందరెడ్డి, టీడీపీ వైపు యువత, మహిళలు అధిక సంఖ్యలో ఆకర్షితులవుతున్నారని అన్నారు.

More Telugu News