: విజయవాడలో దగ్ధమవుతున్న ఆర్టీసీ బస్సు.. బస్సు దిగి పరుగులు పెట్టిన ప్రయాణికులు!

ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు కిందకు దిగి, ప్రాణభయంతో పరుగులు తీశారు. విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజిన్‌లో మంటలు చెలరేగి ఆ వెంటనే బస్సు మొత్తం వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను హెచ్చరించడంతో వారు బస్సు దిగి పరుగులు పెట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం మంటల్లో చిక్కుకున్న బస్సు దగ్ధమవుతోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

More Telugu News