vijay setupathi: స్టార్ హీరో జోడీగా సాయేషా సైగల్

తెలుగు తెరకి 'అఖిల్' సినిమాతో పరిచయమైన సాయేషా సైగల్ .. గ్లామర్ పరంగా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా పరాజయంపాలు కావడం వలన, ఆ తరువాత ఆమెకి ఇక్కడ అవకాశాలు రాలేదు. దాంతో ఆమె కోలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఆల్రెడీ 'వనమాగన్' చేసిన సాయేషా సైగల్ .. రీసెంట్ గా విశాల్ - కార్తీ సినిమాను కూడా అంగీకరించింది.

 తాజాగా ఆమె విజయ్ సేతుపతి సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. 'విక్రమ్ వేదా' సినిమాతో మరింత క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ సేతుపతి,  గోకుల్ దర్శకత్వంలో 'జుంగా' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా సాయేషా సైగల్ ను తీసుకున్నారు. ఈ సినిమా షూటింగులో ఎక్కువ భాగాన్ని పారిస్ లో ప్లాన్ చేసినట్టు సమాచారం.     

More Telugu News