: పుల్వామాలో ఉగ్రదాడి.. ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది భారత జవాన్లు!
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే తేరుకున్న భారత ఆర్మీ ఉగ్రవేట మొదలుపెట్టి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. ప్రస్తుతం పుల్వామాలో ఉగ్రవాదుల కోసం ఆర్మీ గాలిస్తోంది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పుల్వామాలో ఉన్న ఇతర ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అదనపు బలగాలు చేరుకున్నాయి.