: కమిషనరేట్‌ కేంద్రం ప్రాంగణంలో తుపాకీతో కాల్చుకుని.. కానిస్టేబుల్ ఆత్మహత్య

కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ కేంద్రం ప్రాంగణంలో ఓ కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ రోజు ఆయ‌న‌ ఎస్కార్ట్‌ విధులకు వెళ్లాల్సి ఉంది. ఎప్ప‌టిలాగే కార్యాల‌యానికి వ‌చ్చిన ఆయ‌న‌.. తుపాకుల విభాగంలో తుపాకీని తీసుకున్నాడు. అయితే, త‌న బైక్ వైపున‌కు వెళ్తూ ఒక్క‌సారిగా తుపాకీతో కాల్చుకున్నాడు. దీంతో కానిస్టేబుల్ అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయాడ‌ని సంబంధిత అధికారులు తెలిపారు. స‌ద‌రు కానిస్టేబుల్‌ పేరు చంద్రయ్య గౌడ్ అని, ఆయ‌న ఎందుకో మానసికంగా కుంగిపోతున్నాడ‌ని, చికిత్స కూడా తీసుకుంటున్నాడ‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నామ‌ని తెలిపారు. 

More Telugu News