: కూతురు అందవికారంగా వుందని.. చంపేసి నీళ్ల బకెట్లో పడేసిన తల్లిదండ్రులు!

అభం శుభం తెలియని త‌మ ఐదేళ్ల కూతుర్ని త‌ల్లిదండ్రులు చంపేసి, నీళ్ల బ‌కెట్లో ప‌డేసిన ఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో చోటు చేసుకుంది. ఆ త‌రువాత త‌మ కూతురు క‌నిపించ‌డం లేద‌ని నాట‌కం ఆడారు. త‌మ కూతుర్ని ఎవ‌రో కిడ్నాప్ చేశార‌ని పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు అస‌లు విష‌యాన్ని క‌నిపెట్టారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... ప్రొద్దుటూరు అమృతానగర్‌కు చెందిన గైబుషా, ఫాతిమా దంపతులు తమ ఐదేళ్ల కూతురు రొఖియా (5) కు మెద‌డువాపు వ్యాధి రావ‌డంతో ఆమె లావ‌యిపోతోంద‌ని, అంద వికారంగా త‌యార‌వుతోంద‌ని ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News