: ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం...సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు

ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్ లోని అజంఘడ్ నుంచి డిల్లీ వెళ్తున్న కైఫియత్ రైలు తెల్లవారు జామున 2:40 నిమిషాలకు ఔదారియా సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 10 బోగీలు పట్టాలు తప్పగా, పలువురు గాయపడ్డట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగి, సహాయకచర్యలు చేబట్టాయి. అయితే, చీకటి వేళ ప్రమాదం జరగడం వల్ల పూర్తి స్థాయి సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. క్షతగాత్రులను మాత్రం హుటాహుటీన ఆసుపత్రికి తరలించి, చికిత్స కొనసాగిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News