jagapathibabu: 'రంగస్థలం'లో బోయపాటి విలన్స్!

తెలుగు తెరపై యాక్షన్ చిత్రాలను ఆవిష్కరించడంలో బోయపాటికంటూ ఒక ప్రత్యేకత వుంది. ఈ కారణంగానే మాస్ ఇమేజ్ ను కోరుకునే హీరోలంతా ఆయన దర్శకత్వంలో పనిచేయటానికి ఆసక్తిని చూపుతుంటారు. గతంలో హీరోగా చేసినవారినే విలన్ గా మార్చేసి .. ఆ నటులకు బోయపాటి విపరీతమైన క్రేజ్ ను తీసుకొస్తుంటాడు.

 హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబును ఆయన 'లెజెండ్' సినిమాతో విలన్ గా మార్చేశాడు. అంతే, ఆ సినిమాతో ఆయన కెరియర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇక 'సరైనోడు' సినిమాతో ఆది పినిశెట్టిని విలన్ గా చేశాడు. ఈ సినిమా హిట్ తో ఆయనకి మంచి పేరొచ్చింది. అలాంటి ఈ ఇద్దరూ 'రంగస్థలం 1985' సినిమాలో చేస్తుండటం విశేషం. అయితే వాళ్ల పాత్రలు ఎలా వుంటాయనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.         

More Telugu News