ntr: ఆడియో రిలీజ్ ను ప్లాన్ చేస్తోన్న 'జై లవ కుశ' టీమ్!

'జై లవ కుశ' సినిమా చిత్రీకరణ పరంగా చివరి దశకి చేరుకుంది. ఈ సినిమా నుంచి వచ్చిన 'లవ' లుక్ ఆకట్టుకోవడంతో, టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'వినాయక చవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన టీజర్ ను వదలనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో రిలీజ్ గురించి కూడా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

తమ ఫేవరేట్ హీరో పాటలను దేవిశ్రీ ప్రసాద్ ఏ రేంజ్ లో అదరగొట్టేశాడో తెలుసుకోవడానికి వాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. దాంతో సెప్టెంబర్ మొదటివారంలో ఆడియో వేడుక జరపడానికి ఈ సినిమా టీమ్ ఏర్పాట్లు మొదలెట్టేసింది. భారీస్థాయిలో ఆడియో వేడుక జరగనున్నట్టు తెలుస్తోంది. కథ .. కథనాలు .. ఎన్టీఆర్ విభిన్నమైన పాత్రలు .. దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయని అంటున్నారు.  

More Telugu News