rana: రాజశేఖర్ తో చేయాలనుకున్నదే రానా చేశాడు!

రాజశేఖర్ కథానాయకుడిగా తాను 'అహం' అనే సినిమాను చేస్తున్నట్టుగా ఆ మధ్య దర్శకుడు తేజ చెప్పాడు. ఆ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతున్నట్టుగా కూడా చెప్పుకున్నారు. ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజక్టు పట్టాలెక్కలేదు. ఈ నెల 11వ తేదీన విడుదల కానున్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా .. గతంలో రాజశేఖర్ తో తేజ చేయాలనుకున్నదేనట.

ఫిల్మ్ నగర్లో ఈ టాక్ వచ్చింది .. తాజాగా సురేశ్ బాబు మాటలతో ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. తేజ 'అహం' పేరుతో తమకి ఒక కథ వినిపించాడనీ, దానిని 'నేనే రాజు నేనే మంత్రి'గా మార్చామని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమాపై దర్శకుడు తేజ .. నిర్మాత సురేశ్ బాబు .. హీరో రానా అంతా కూడా బలమైన నమ్మకంతో వున్నారు. ఆ నమ్మకంతోనే పోటీకి వెనుకాడకుండా రంగంలోకి దిగుతున్నారు.     

More Telugu News