rana: పారితోషికంగా పైసా ఇవ్వలేదన్న రానా!

ఆ మధ్య అల్లు అర్జున్ ఒక వేదికపై మాట్లాడుతూ .. 'సరైనోడు' సినిమా సూపర్ హిట్ అయిదనీ, చాలా లాభాలు తెచ్చిపెట్టిందని అన్నాడు. అయినా తన తండ్రి తనకి ఏమీ ఇవ్వలేదని .. ఏదైనా ఇస్తే బాగుంటుందంటూ చమత్కరించాడు. ఇప్పుడు రానా కూడా తన తండ్రిని ఉద్దేశించి అలాంటి మాటే అనేశాడు.

తాజాగా ఆయన ఓ వేదికపై మాట్లాడుతూ, 'నేనేరాజు నేనే మంత్రి' సినిమా చేసినందుకు, తనకి పారితోషికంగా తండ్రి
పైసా కూడా ఇవ్వలేదని అన్నాడు. ఒకవేళ అడిగితే తిండి పెట్టడం మానేస్తారేమోనంటూ జోక్ చేశాడు. ఆ సమయంలో అక్కడే వున్న సురేశ్ బాబు అది విని నవ్వుకున్నారు. ఇక ఈ సినిమా కంటెంట్ పైనా .. అది తీసుకురానున్న సక్సెస్ పైనా తండ్రీ కొడుకులిద్దరూ పూర్తి నమ్మకంతో వున్నారు. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.

More Telugu News