: తడబడ్డా నిలదొక్కుకున్నారు... ధావన్ హాఫ్ సెంచరీతో కదిలిన స్కోర్ బోర్డు

ఆదిలోనే వికెట్ ను కోల్పోయినప్పటికీ, ఓపెనర్ శిఖర్ ధావన్ కు తోడుగా, చటేశ్వర్ పుజారా నిలదొక్కుకోవడంతో, గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్కోరు ముందుకు కదిలింది. 27 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయిన భారత జట్టును శిఖర్ ధావన్ తన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. టెస్టు మ్యాచ్ లా కాకుండా, వన్డే మ్యాచ్ లా దూకుడుగా ఆడుతున్న ధావన్, పుజారాలు స్కోరును పరుగులు పెట్టించి, ఓవర్ కు నాలుగు పరుగులకు పైగానే పిండుకున్నారు. ఈ క్రమంలో 62 బంతులాడిన ధావన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా, పుజారా 45 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 28 పరుగుల వద్ద ఉన్నాడు. ప్రస్తుతం భారత స్కోరు 22 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 92 పరుగులు.

More Telugu News