varun tej: తెలంగాణ యాస అదరగొట్టిన సాయి పల్లవి!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మంచి ఫీల్ వున్న ప్రేమకథలు తెరకెక్కుతూ ఉంటాయి. అందువలన అందరి దృష్టి 'ఫిదా' వైపు మళ్లింది. అయితే ఈ సినిమాలో కథానాయిక తెలంగాణ అమ్మాయనీ .. తెలంగాణ యాస మాట్లాడుతుందని మరింత ఆసక్తిని కలిగించారు. ఈ పాత్ర కోసం తెలుగు రాని అమ్మాయిని కథానాయికగా ఎంపిక చేయడం ఒక విశేషమైతే .. ఆమెతోనే డబ్బింగ్ చెప్పించడం మరో విశేషం.

అసలు తెలుగు తెలియనివాళ్లు .. వెంటనే ఆ భాష నేర్చుకోవడం కొంత కష్టమైతే .. తెలంగాణ యాస పలకడం మరింత కష్టం. అలాంటిది ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ యాసను పలకడంలో సాయి పల్లవి ఫుల్ మార్క్స్ కొట్టేసింది. దర్శకుడు శేఖర్ కమ్ముల .. నిర్మాత దిల్ రాజు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ అమ్మాయి నిజం చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ నెల 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • Loading...

More Telugu News