: 1971 ఇండో-పాక్ యుద్ధ నేప‌థ్యంలో అనుప‌మ్ ఖేర్ వెబ్ సిరీస్‌!

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నిర్మాత‌గా మారి ఓ వెబ్ సిరిస్‌ను తీయ‌బోతున్నారు. 1971 భార‌త పాకిస్థాన్ యుద్ధ నేప‌థ్యంలో ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంద‌ని అనుప‌మ్ తెలిపారు. ఇందులో తాను న‌టిస్తానా? లేదా? అనే విష‌యాన్ని ఇప్ప‌ట్లో చెప్ప‌లేన‌ని ఆయన అన్నారు. భార‌త‌దేశంలో నెట్‌ఫ్లిక్స్ రాక‌తో వెబ్‌సిరీస్‌ల హ‌డావిడి మొద‌లైంది. వారు అడ‌గ‌టం వ‌ల్ల‌నే తాను వెబ్‌సిరీస్ నిర్మించేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్లు అనుప‌మ్ వివ‌రించారు.

More Telugu News