: ఛాంపియన్స్ ట్రోఫీ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు

ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో 7వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికాతో పాకిస్థాన్ ఢీ కొడుతోంది. సౌతాఫ్రికా ఇప్పటికే శ్రీలంకపై గెలిచి 2 పాయింట్లు ఖాతాలో వేసుకోగా, టీమిండియాపై ఓడి పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ నేపథ్యంలో సఫారీలు విజయం సాధిస్తే నేరుగా సెమీస్ బెర్తు కన్ ఫాం చేసుకుంటారు. ఇక పాక్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన సఫారీలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. టోర్నీలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయానికి బాటలు వేసుకుంటుండడంతో... టాస్ గెలిచిన సఫారీలు నైతికంగా ధైర్యం సంతరించుకున్నారు. పాక్ జట్టులోకి ఒక కొత్త ముఖం వచ్చింది. ఫఖర్ జమాన్ కి షోయబ్ మాలిక్ పాక్ క్యాప్ ను అందించాడు. జునైద్ ఖాన్ ను జట్టులోకి తీసుకున్నారు. 

More Telugu News