: అమిత్ షాకు అనారోగ్యం... ఢిల్లీ ప్రచార బరిలో స్మృతీ ఇరానీ

ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ, ప్రచార బాధ్యతలనంతా భుజానికెత్తుకున్న అమిత్ షా స్వల్ప అనారోగ్యం పాలు కావడంతో, ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను స్మృతీ ఇరానీ తన భుజాలపై వేసుకున్నారు. ఆమెతో పాటు మరో స్టార్ క్యాంపెయినర్ ఉమా భారతి, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అరవీందర్ సింగ్ లవ్లీ తదితరులు ప్రచారంలో దూసుకెళుతున్నారు.

 ఇక ఇటీవలి పోల్ సర్వేల్లో ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం తథ్యమని అంచనాలు వెలువడిన నేపథ్యంలో, ఆ పార్టీ నేతలు మరింత జోరుగా ప్రచారంలో తలమునకలయ్యారు. ఈ ఎన్నికల తరువాత ఆప్, కాంగ్రెస్ లు తుడిచిపెట్టుకుపోనున్నాయని స్మృతీ ఇరానీ వ్యాఖ్యానించారు. ప్రధానిపై నమ్మకం ఉంచితే, కొత్త రోడ్లు వస్తాయని, పేదలకు ఇళ్లు, విద్యా సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. మోదీ మేజిక్ ప్రతి చోటా కనిపిస్తోందని, ఇక ఢిల్లీ వంతు వచ్చిందని అన్నారు. కాగా, ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పటికీ, పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో బిజీగా ఉన్నారు.

More Telugu News