: పదకొండేళ్ల తరువాత భారత ఫుట్ బాల్ జట్టు తొలి విజయం!

2006లో షణ్ముగం వెంకటేష్ నేతృత్వంలో పాకిస్థాన్‌ జట్టుపై విజయం సాధించిన భారత ఫుట్ బాల్ జట్టు పదకొండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఒక విదేశీ జట్టును ఓడించింది. భారత ఫుట్ బాల్ జట్టు ఈ ఏడాది ఆడిన తొలి ఫ్రెండ్లీ మ్యాచ్ లో అద్భుతంగా ఆడి, కంబోడియా జట్టుపై ఘన విజయం సాధించింది. అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ లో భాగంగా జరిగిన పోరులో కంబోడియా జట్టుపై 3-2 గోల్స్ తేడాతో భారత ఫుట్ బాల్ జట్టు విజయం సాధించింది. దీంతో భారత ఫుట్ బాల్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.  

More Telugu News