: తూర్పు రాయలసీమలో టీడీపీ అభ్యర్థిపై పీడీఎఫ్‌ అభ్యర్థి విజయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ ఫలితం వెలువడింది. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను తూర్పు రాయలసీమగా వ్యవహరిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడిపై రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో 3545 ఓట్ల తేడాతో పీడీఎఫ్‌ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 17, 652 ఓట్లు పోలవ్వగా, 537 ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 3,545 ఓట్ల తేడాతో టీచర్స్ యూనియన్ పీడీఎఫ్ (పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్) అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించారు. మరికొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 

More Telugu News