bsnl: మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ నుంచి మ‌రో తీపిక‌బురు వ‌చ్చింది. త‌మ ఖాతాదారుల‌కు కేవ‌లం అతి త‌క్కువ ధ‌ర‌కే అన్‌లిమిటెడ్ కాలింగ్ స‌దుపాయాన్ని క‌ల్పిస్తూ మ‌రో కొత్త ప్ర‌మోష‌న‌ల్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఎక్స్ పీరియన్స్ ఎల్‌ఎల్ 49 పేరుతో ఈ ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫ‌ర్ కింద రూ.49లకే లాండ్‌ లైన్‌ కనెక్షన్‌ రీచార్జ్‌ చేసుకునే అవకాశాన్ని అందుబాటులో ఉంచడ‌మే కాకుండా, రాత్రి 9గం. నుంచి ఉదయం 7గం. వరకు ఉచిత కాలింగ్ స‌దుపాయాన్ని కూడా క‌ల్పిస్తున్న‌ట్లు ఆ సంస్థ పేర్కొంది. అంతేకాదు, అలాగే  నెలలోని అన్ని ఆదివారాల్లో ఏ నెట్‌ వర్క్‌కైనా అన్‌లిమిటెడ్‌ కాల్స్ ఆఫ‌ర్‌ను కూడా అందిస్తున్న‌ట్లు తెలిపింది.

ఈ ఆఫ‌ర్‌ ఆరు నెలల వరకు వినియోగించుకోవ‌చ్చ‌ని పేర్కొంది. ఆ త‌రువాత ఖాతాదారులు నెలవారీ ప్లాన్‌ ప్రకారం రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆఫ‌ర్‌లో భాగంగా ఒక  సిమ్‌ కార్డ్ ను సైతం ఫ్రీగా ఆఫ‌ర్ చేస్తోంది. కాగా, త‌మ‌ కొత్త ఖాతాదారులు రూ.149 రీచార్జ్‌పై ఏ నెట్‌వర్క్‌కైనా ప్రతిరోజు 30 నిమిషాల ఫ్రీ వాయిస్ కాలింగ్ ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చ‌ని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

More Telugu News