jc divakar reddy: రాయలసీమలో నేను ఒక్కడినే రెడ్డిని: జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

టీడీపీ ఎంపీ దివాకర్‌రెడ్డి మ‌రోసారి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ‘రాయలసీమలో నేనొక్క‌డినే రెడ్డిని... రాజకీయ నేతల్లో రెడ్డి కులస్తులు ఎవరూ లేరు... ఈ విష‌యాన్ని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను.. దమ్ముంటే జగన్మోహ‌న్‌రెడ్డి తాను రెడ్డిన‌ని ప్రకటించుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. అయితే, త‌న‌కు ఇత‌ర కులాలవారంటే ద్వేషం లేదని జేసీ పేర్కొన్నారు. త‌మ‌ కులాల వారు తన దగ్గరికి సాయం కోసం వ‌స్తే తాను వారికి సాయం చేసే భావన తనలో ఉందని అన్నారు. రెడ్లే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను నాశనం చేశారని,  రాష్ట్రాన్ని చీల్చి రెండు ముక్కలు చేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన విష‌యంలో తాను మొదటి నుంచీ నెత్తీ నోరూ బాదుకున్నాన‌ని, చేతులు పట్టుకున్నాన‌ని, త‌న మాట‌ల్ని రెడ్లు ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్య‌లు చేశారు.

More Telugu News