panner selvam: ఢిల్లీలో మోదీతో పన్నీర్‌ సెల్వం భేటీ .. జల్లికట్టుపై ఆర్డినెన్స్ కావాలని వినతి!

జ‌ల్లిక‌ట్టుకు మ‌ద్ద‌తుగా తమిళనాడులో భారీ ఎత్తున‌ ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఈ రోజు ఉద‌యం ఢిల్లీకి చేరుకొని ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. జల్లికట్టుపై నిషేధం విధిస్తూ గ‌తంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ నిషేధాన్ని తొలగించేలా అత్య‌వ‌స‌ర ఆదేశాలు జారీ చేయాలని ఆయ‌న మోదీని కోరారు. తొంద‌ర‌గా ఓ నిర్ణ‌యం తీసుకోకపోతే త‌మిళ‌నాడులో శాంతిభద్రల సమస్య తలెత్తే అవకాశం ఉందని పన్నీర్ సెల్వం అన్నారు. మ‌రోవైపు జ‌ల్లిక‌ట్టుకి మ‌ద్ద‌తుగా చెన్న‌య్‌లోని మెరీనా బీచ్ వ‌ద్ద వ‌రుస‌గా మూడోరోజు ప్ర‌జ‌లు భారీ ఎత్తున ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు.

More Telugu News