demonitization: అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు

పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేప‌థ్యంలో పాత‌నోట్ల‌ను మార్చుకునేందుకు ఆర్‌బీఐ ఇచ్చిన గ‌డువు ముగిసిన‌ప్ప‌టికీ పోలీసుల‌కు భారీ మొత్తంలో న‌గ‌దు ప‌ట్టుబ‌డుతోంది. ఈ రోజు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆగ్రాలో త‌నిఖీలు నిర్వ‌హిస్తోన్న పోలీసులు రూ.కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును నలుగురు వ్య‌క్తులు త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశార‌ని, వారిని అదుపులోకి తీసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తాము ఐటీ శాఖ అధికారులకు సమాచారమందించామ‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

More Telugu News