up elections: ప్రియాంక గాంధీతో అఖిలేష్ భార్య డింపుల్ చర్చలు.. లక్నోలో వెలసిన పోస్టర్లు

వ‌చ్చే నెల జ‌ర‌గ‌నున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి పోటీలోకి దిగాల‌ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీతో అఖిలేష్ భార్య డింపుల్ స‌మావేశం అయిన‌ట్లు స‌మాచారం. తాజాగా లక్నోలో డింపుల్, ప్రియాంక ఫొటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌నే రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మహిళలంతా కలిసి త‌మ కూట‌మిని గెలిపించాల‌ని ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ఈ ఇరువురినీ ప్రచారంలోకి దింపి మహిళా ఓటర్లను ఆకర్షించవచ్చని ఆ పార్టీలు భావిస్తున్నాయి.

More Telugu News