surgical strikes: ప్ర‌తీకారంగా 30 మంది భార‌త సైనికులను చంపామంటున్నహఫీజ్‌ సయీద్‌.. నీకంత సీన్ లేదన్న ఇండియన్ ఆర్మీ!

ఉరీ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల‌పై భార‌త ఆర్మీ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, త‌మపై  భార‌త ఆర్మీ జ‌రిపిన దాడికి ప్ర‌తీకారంగా జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్‌ ఆర్మీ క్యాంపుపై త‌మ‌ ఉగ్రవాదులు దాడి చేసి 30 మంది సైనికులను హ‌త‌మార్చార‌ని పాక్‌ టెర్రరిస్టు నాయకుడు హఫీజ్‌ సయీద్ అన్నాడు. అనంత‌రం త‌మ ఉగ్ర‌వాదులు సురక్షితంగా తప్పించుకున్నార‌ని చెప్పాడు.

అయితే, భారత ఆర్మీ హ‌ఫీజ్ చేసిన‌ ప్రకటనను ఖండించి, ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను కొట్టిపారేసింది. అఖ్నూర్‌లో కాకుండా వేరొక ఘటనలో జ‌రిగిన దాడిలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయార‌ని పేర్కొంది. హఫీజ్‌ సయీద్ ఇటీవ‌ల‌ ముజఫరాబాద్‌లో ఒక సభ నిర్వహించి మాట్లాడాడు. ఆయ‌న ప్ర‌సంగం ఆడియోను పలు మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. అందులో హ‌ఫీజ్ స‌యీద్ మాట్లాడుతూ... భార‌త‌ ఆర్మీ పీవోకేలో ల‌క్షిత దాడులు జ‌ర‌ప‌లేద‌ని, ఆ దాడులు జ‌రిపిన‌ట్లు భార‌త ప్ర‌భుత్వం ప్రపంచాన్ని మోసం చేసిందని వ్యాఖ్యానించాడు. అయితే తమ ఉగ్ర‌వాదులు మాత్రం అసలైన లక్షిత‌దాడులు ఎలా ఉంటాయో భార‌త్ కు తెలియ‌జేశార‌ని అన్నాడు.

  • Loading...

More Telugu News