mulayam singh yadav: ఎన్నికల సంఘం కార్యాలయంకు ములాయం.. గొడవల వెనుక ఓ వ్యక్తి ఉన్నాడని వ్యాఖ్య‌

తండ్రీకొడుకుల విభేదాల కార‌ణంగా స‌మాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నిక‌ల‌ గుర్త‌యిన సైకిల్ ఎవ‌రిది? అనే అంశాన్ని తేల్చ‌డానికి త‌మ‌కు నివేదిక స‌మ‌ర్పించాలంటూ ఈసీ ఇచ్చిన గ‌డువు ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్ప‌టికే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అఖిలేష్ వ‌ర్గం ఈసీకి అఫిడ‌విట్ ఇచ్చి ఆ గుర్తు త‌మ‌కే ద‌క్కుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేసింది.

కాగా, ఈ రోజు సైకిల్ గుర్తు కోసం అఫిడవిట్ సమర్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంకు ములాయం సింగ్ యాద‌వ్ వ‌చ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... త‌మ పార్టీలో జ‌రుగుతున్న గొడవల వెనుక ఓ వ్యక్తి ఉన్నాడని వ్యాఖ్యానించారు. అయితే, ఆ వ్యక్తి ఎవరో చెప్పలేదు. త‌మ‌ పార్టీలో ఓ సమస్య వచ్చిపడిందని చెప్పారు. తనకు, అఖిలేష్‌కు మధ్య ఎలాంటి వివాదాలు లేవ‌ని, తమ పార్టీలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించారు.

More Telugu News