dilsukh nagar attacks: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు: అప్పీళ్లను స్వీకరించిన హైకోర్టు

మూడున్న‌రేళ్ల క్రితం జ‌రిగిన దిల్‌సుఖ్‌న‌గ‌ర్ జంట పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన అసదుల్లా అక్తర్, యాసిన్ భత్కల్, తహసిన్ అక్తర్, జియాహుల్ రెహ్మాన్, యజాజ్ షేక్ లకు ఉరిశిక్ష‌ను ఖ‌రారు చేస్తూ ఎన్ఐఏ న్యాయ‌స్థానం తీర్పు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ కేసులో వ‌చ్చిన‌ అప్పీళ్ల‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అప్పీల్, రీట్రయల్ ల‌ను కలిపి తుది విచారణను చేపట్టాలని నిర్ణ‌యం తీసుకుంది. ఈ కేసులో దోషులు కూడా ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును స‌వాలుచేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.

More Telugu News