mulayam singh yadav: అనైతికంగా నిర్ణయాలు తీసుకున్నారు: ములాయం సింగ్ యాదవ్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అధికార‌ సమాజ్‌వాదీ పార్టీలో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ జాతీయాధ్య‌క్షుడి హోదాలో ప్ర‌సంగించ‌డమే కాకుండా పార్టీ రాష్ట్ర‌ అధ్య‌క్ష‌ప‌ద‌వి నుంచి శివపాల్‌యాదవ్‌ను, పార్టీలోంచి అమర్‌సింగ్‌లను తొల‌గించిన అంశాల‌పై ములాయం సింగ్‌ యాదవ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నిర్ణయాలు అనైతికం అని పేర్కొన్నారు. మ‌రికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇప్పటివరకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను తాను ఆమోదిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ నెల 5న నిర్వ‌హించ‌నున్న‌ పార్టీ జాతీయ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామ‌ని, మిగిలిన అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

More Telugu News