shabbir ali: వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం సరికాదు: షబ్బీర్ అలీ

శాసనమండలిలో వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం సరికాదని కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు శాసనమండలిలో ఆయ‌న మాట్లాడుతూ... రైతు సమస్యలపై తెలంగాణ ప్ర‌భుత్వ పక్ష స‌భ్యులు చర్చకు ముందుకు రావడం లేదని ఆయ‌న అన్నారు. ఈ నెల 16 నుంచి తాము ఏడు వాయిదా తీర్మానాలు ఇచ్చామ‌ని, వాటిని సభాపతి తిరస్కరించారని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్ర‌జ‌లు, రైతుల‌ సమస్యలు, నాగార్జునసాగర్‌ నీటి పంపిణీతో పాటు ప‌లు అంశాలపై తాము చ‌ర్చించాల‌నుకున్నామ‌ని అయితే వాటిని స‌ర్కారు పట్టించుకోవడం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. తాము సభాపతి అధికారాలను ప్రశ్నించడం లేదని అన్న ష‌బ్బీర్ అలీ...  వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తూ సభాప‌తి ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం సరికాదని వ్యాఖ్యానించారు. స‌భ‌లో మెజారిటీ ఉందని సర్కారు శాస‌న‌స‌భ‌ను తప్పుదోవ పట్టిస్తోందని ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News