demonitisation: చెన్నయ్ విమానాశ్రయంలో భారీగా రూ.2 వేల నోట్లు స్వాధీనం

పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో అక్ర‌మ న‌గ‌దు త‌ర‌లింపులను నిరోధించేందుకు ముమ్మ‌రంగా తనిఖీలు చేస్తోన్న అధికారుల‌కు భారీ ఎత్తున డ‌బ్బు ప‌ట్టుబ‌డుతూనే ఉంది. న‌ల్ల‌కుబేరులు న‌గ‌దు త‌ర‌లింపుల‌కు విమానాల‌ను కూడా ఉప‌యోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో త‌నిఖీ సిబ్బందికి అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ రోజు ఉద‌యం చెన్నయ్‌ విమానాశ్రయంలో త‌నిఖీలు చేస్తోన్న సిబ్బంది భారీగా కొత్తనోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్య‌క్తుల నుంచి ఏకంగా రూ.1.34 కోట్ల కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క‌రెన్సీ అంతా రూ.2000 నోట్లేన‌ని అధికారులు మీడియాకు తెలిపారు. ఆ డ‌బ్బుని ఎక్క‌డి నుంచి ఎక్క‌డ‌కు త‌ర‌లిస్తున్నారు? ఎవ‌రిది? అనే అంశాల‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

More Telugu News